ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ఎలాంటి నోటీసూ రాలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 02:56 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  హత్యకేసులో  కేసు విచారణకు నిన్న ఎంపీ అవినాశ్ రెడ్డి  హాజరయ్యారు. నేడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి  విచారణకు హాజరు కావాల్సి ఉంది. మొన్నటికి మొన్న తనకు పనులున్నాయని విచారణకు హాజరు కాలేనని సీబీఐ వద్ద మొరపెట్టుకున్నారు భాస్కర్‌రెడ్డి. దీంతో సీబీఐ  సైతం విచారణకు మరో తేదీ ప్రకటిస్తామని వెల్లడించింది. ఆ గడువు ప్రకారం 25న అంటే నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ లోపే భాస్కర్‌రెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సీబీఐ నుంచి విచారణకు రమ్మని తనకు ఎలాంటి నోటీసూ రాలేదన్నారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో 24 తరువాత అందుబాటులోఉంటానని సమాచారం మాత్రం పంపానన్నారు. నేటి విచారణ విషయమై మీడియాలోచూసి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు ఫోన్ చేశానన్నారు. కానీ తనకు సీబీఐ నుంచి ఎలాంటి రిప్లై లేదన్నారు. అయినప్పటికీ కూడా ఉదయం పది గంటల తరువాత కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో విచారణకు సీబీఐ వద్దకు వస్తానని వైఎస్ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa