ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురుని చంపిన తండ్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 02:58 PM

నంద్యాల జిల్లా, పాణ్యం మండలం, ఆలమూరు గ్రామంలో పరువు హత్య జరిగింది. తండ్రి దేవేంద్ర రెడ్డి కుమార్తె ప్రసన్నను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండేళ్ల క్రితం బనగానపల్లె మండలం, జిల్లెల్ల గ్రామానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహం జరిగింది. వివాహమైనా.. ఆలమురు గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో ప్రసన్న అక్రమ సంబంధం పెట్టుకుంది. పద్ధతి మార్చుకోమని తండ్రి దేవేంద్ర రెడ్డి పలుమార్లు కుమార్తెను మందలించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. భర్త దగ్గరికి వెళ్లమని చెప్పినా ప్రసన్న పట్టించుకోలేదు. దీంతో ఊరిలో పరువు పోయిందని భావించిన తండ్రి కుమార్తె గొంతు నులిమి చంపేశాడు. ఆలమూరులో హత్య చేసి గిద్దలూరు ఫారెస్ట్‌లో తల మొండెం వేరు చేసి దూరంగా పడేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa