ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాక్టర్ నిర్లక్ష్యం వలనే బిడ్డ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 02:57 PM

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరులో వైద్యురాలి నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది అంటూ  బాధిత బంధువులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. డాక్టర్ కళ్యాణి నిర్లక్ష్యం వలనే తమ బిడ్డ మృతి చెందాడని శనివారం ఉదయం జి.కొండూరు పీహెచ్‌సీ వద్ద బాధితులు నిరసన చేపట్టారు.వివరాల్లోకి వెళ్ళితే.... ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన రూపశ్రీ అనే మహిళ ప్రసవ నొప్పులతో శుక్రవారం మధ్యాహ్నం జి.కొండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. రాత్రి 11 గంటలకు ప్రసవం జరిగింది. అయితే శిశువులో చలనం లేకపోవడంతో విజయవాడ తీసుకెళ్ళమని ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే బిడ్డ మృతి చెందినట్లు విజయవాడ వైద్యులు దృవీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa