అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మునగపాక మండలం గణపర్తిలో దారుణ హత్య జరిగింది. మేనమామ స్వయంగా మేనల్లుడిని దారుణంగా హత మార్చి మొండెం నుంచి తలను వేరు చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నర్సీపట్నానికి చెందిన శ్రీను అతని మేనల్లుడు లోవరాజు ఇటీవలే జీవనోపాధి నిమిత్తం గణపర్తికి వచ్చి అక్కడ చికెన్ షాపును నడుపుతున్నారు.
వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ లోవరాజును శ్రీను దారుణంగా హత్య చేశాడు. ఆపై మేనల్లుడి తల నరికి, మొండెంను వేరు చేశాడు. లోవరాజు తలను గోనె సంచిలో పెట్టి, మొండెంను గదిలో దహనం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి పరిశీలించారు. శ్రీనుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa