ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం చేపట్టే చాయ్‌ బిస్కట్‌ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 02:42 PM

రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తమకు నెలనెలా ఫస్టున రావలసిన వేతనాలు.. అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో చెల్లిస్తే ఈ పరిస్థితి ఎందుకొస్తుందని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో ప్రభుత్వం చేపట్టే చాయ్‌ బిస్కట్‌ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఉద్యోగులు ఒక్క రూపాయి పొందింది లేదన్నారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చారన్నారు. ఉద్యోగుల జీత భత్యాల కోసం పెట్టిన బడ్జెట్‌ను ప్రభుత్వం కావాలనే మళ్లిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా వాడుకునే హక్కు దానికి ఎవరిచ్చారని నిలదీశారు. మంగళవారమిక్కడ అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిసి మార్చి 9 నుంచి తలపెట్టిన ఉద్యమ కార్యాచరణ నోటీసును ఏపీ జేఏసీ అమరావతి అందజేసింది. అనంతరం సెక్రటరీ జనరల్‌ దామోదరరావుతో కలిసి బొప్పరాజు మీడియాతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa