ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 13న సెలవు ప్రకటించింది. ఏపీలో సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్-సీఈవో) ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 8 స్థానిక సంస్థలలో 9 నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa