ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ భూమిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 05:15 PM

వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ గిరిష పిఎస్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా రామాపురం మండలం, కాకులారం గ్రామంలో సర్వే నెంబర్ 628/2 లో 96. 8 ఎకరాలు, మరియు బండపల్లి నందు సర్వే నెంబర్ 324 లో108. 15 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం పరిశీలించారు. రాయచోటి నియోజకవర్గంలో ఏపీఐఐసీ (ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) వారి ద్వారా వివిధ పరిశ్రమలు స్థాపించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి రాయచోటి నియోజకవర్గంలో మినిమం 500 నుంచి1000 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించాలని జిల్లా కలెక్టర్ నియోజకవర్గంలోని తహసిల్దార్లకు సూచించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa