గోవా వెళ్లాలనుకునే ఏపీ ప్రజలకు ఓ శుభవార్త. సాధారణంగా విజయవాడ లేదా వైజాగ్ నుంచి గోవాకు వెళ్లాలంటే కష్టం. హైదరాబాద్ వెళ్లి.. అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో గోవాకు వెళ్లాలి. ఇదంతా ఎందుకని చాలామంది గోవా వెళ్లడం మానుకుంటారు. కానీ.. ఇకపై ఏ కష్టం లేకుండా గోవా వెళ్లవచ్చు. అవును.. ఏపీ నుంచి గోవాకు వెళ్లే ప్రయాణీకులకు.. ఇండిగో ఎయిర్లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి గోవాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది.
ఈనెల 28వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) వైజాగ్- గోవా మధ్య ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం నార్త్ గోవా ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరి.. సాయంత్రం 5.35 గంటలకు వైజాగ్ చేరుతుంది. అలాగే.. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి.. గోవాకు రాత్రి 8.50 గంటలకు చేరుకుంటుంది. అంటే..వైజాగ్ నుండి గోవా ప్రయాణం కేవలం 1 గంట 50 నిమిషాలే.
ప్రస్తుతం విశాఖపట్నం, గోవా మధ్య ఇండిగో, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా సంస్థలు అనేక విమాన సర్వీసులు నడుపుతున్నాయి. అయితే.. ఇవన్నీ డైరెక్ట్ సర్వీసులు కాదు. గోవా నుంచి వైజాగ్.. లేదా వైజాగ్ నుంచి గోవా చేరుకోవాలంటే.. బెంగళూరు లేదా హైదరాబాద్లో ఇంటర్కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిందే. కానీ.. తాజా నిర్ణయంతో.. ప్రయాణికులకు ఆ భారం తగ్గనుంది. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రస్తుతం విశాఖ, గోవా మధ్య ఏడు విమానాలను నడుపుతోంది. ఇవి ఇన్డైరెక్ట్ ఫ్లైట్స్ కావడంతో.. 3 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకే ఇండిగో వైజాగ్- గోవా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa