ఈనెల 13న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో వైయస్ఆర్సిపి అభ్యర్థులకు మద్దతు తెలిపాలని, వారిని గెలిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం కోరారు. గురువారం కర్నూలులో జిల్లా పార్టీ కార్యాలయంలో వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు నగర మేయర్, పట్టభద్రుల ఎన్నికల ఉమ్మడి జిల్లా పరిశీలకులు బివై రామయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిల అధ్యక్షతన జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సమావేశం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa