ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం పాదయాత్ర అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 07:59 PM

 టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర  చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 39వ రోజు పాదయాత్రలో లోకేష్‌ ను మదనపల్లి ప్రముఖులు, విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కి రాష్ట్రాభివృద్ధిపై ఎటువంటి ఆలోచనా లేదన్నారు. అధికారంలోకి వచ్చాక కూల్చివేతలు, ఉన్నకంపెనీలను బెదిరించి పంపడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. మున్సిపాలిటీలు, స్థానికసంస్థలను పూర్తిగా దివాలా తీయించి కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితికి తెచ్చారన్నారు. మదనపల్లి టమోటా రైతుల కష్టాలు తీర్చే విషయంలో టీడీపీకి స్పష్టమైన విజన్ ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు ద్వారా టమోటా రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa