నంద్యాలలో లభ్యమైన పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అధికారులు ఎంతగానో ప్రయత్నించిన విషయం తెలిసిందే. తల్లి జాడను గుర్తించి అది సంచరిస్తున్న ప్రదేశానికి పిల్లలను తీసుకెళ్లి రెండు రోజుల పాటు పులి పిల్లలను తల్లి ఒడికి చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ విఫలమయ్యాయి. దీంతో చేసేదేం లేక అధికారులు వాటిని తిరుపతిలోని ఎస్వీ జూపార్క్కు చేర్చారు. ఈ సందర్భంగా ఎస్వీ జూపార్కు అసిస్టెంట్ కన్జర్వేటర్ నాగభూషణం మాట్లాడుతూ.. పులి పిల్లలను తల్లి పులి దగ్గరకు చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. ఆత్మకూరు నుంచి ఈ రోజు ఉదయం 7 గంటలకు పులి పిల్లలను తిరుపతి ఎస్వీ జూపార్క్ కు తరలించామని నాగభూషణం వెల్లడించారు. వెటర్నరీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పులి పిల్లల వయస్సు 50 రోజులు ఉంటుందన్నారు. నాలుగు పులి పిల్లలు డీహైడ్రేట్ అయ్యాయని వెల్లడించారు. వాటిలో ఒక పులి పిల్ల చాలా వీక్గా ఉందన్నారు. పరీక్షల అనంతరం వాటికి చికిత్సను అందిస్తామని తెలిపారు. పులి పిల్లలను యానిమల్ రెస్క్యూ సెంటర్లో ఉంచి ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. పులి పిల్లలను సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షిస్తామన్నారు. 50 ట్రైల్స్ తర్వాత వాటిని అడవిలోకి వదులుతామని నాగభూషణం వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa