మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుల కోసం ఏలూరు పోలీసులు చేపట్టిన వినూత్న ప్రయోగం విజయవంతం అవుతోంది. బాధితులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే చాలా అంతా పోలీసులు చూసుకుంటారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రాహుల్దేవ్శర్మ కొత్తపద్ధతిని ప్రవేశపెట్టి ఇప్పటి వరకూ ఐదు విడతలుగా సెల్ఫోన్లను రికవరీ చేశారు. రూ.41 లక్షల విలువ చేసే 207 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ రాహుల్దేవ్శర్మ తెలిపారు. ఎస్పీ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9550351100 నెంబర్కు వచ్చిన ఫిర్యాదులు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటివరీ వివిధ రాష్ట్రాల నుంచి 808 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ ఒక కోటి 46 లక్షల 78 వేలు ఉంటుందన్నారు. సైబర్ టీమ్, సీసీఎస్ పోలీసులు, మొబైల్ ట్రాకింగ్పై విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనబర్చిన అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్బీసీఐ రవి కుమార్, డీసీఆర్బీ సీఐ సుబ్బారావు, సీసీఎస్ సీఐ మురళీకృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa