ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణించే శ్రేణిని బట్టి లగేజీపై పరిమితులు... రైల్వే శాఖ తాజా నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 10:02 PM

ఇటీవల రైల్వేశాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పలు కొత్తకొత్త నిర్ణయాలను తీసుకొంటోంది. ఇదిలావుంటే రైలు ప్రయాణాలకు సంబంధించి ఇప్పటి వరకు లగేజీ బరువుపై ఎలాంటి టెన్షన్ లేదు. ప్రయాణికులు ఎంత లగేజీ తీసుకెళ్లినా అధికారులు అభ్యంతరం పెట్టేవారు కాదు. ఇకపై మాత్రం ఇలా కుదరదని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణించే తరగతిని బట్టి ఒక్కో ప్రయాణికుడు తీసుకెళ్లే లగేజీపై పరిమితి విధించింది. ఈ పరిమితి దాటి లగేజీని తీసుకెళితే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. విమాన ప్రయాణాల తరహాలోనే అదనపు లగేజీకి ఛార్జి చెల్లించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అధిక లగేజీతో ప్రయాణించొద్దని, అవసరమైతే లగేజీ పార్శిల్ సర్వీసును ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.


సెకండ్‌ క్లాస్‌ ఏసీలో 50 కిలోలు, థార్డ్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీని ఉచితంగా వెంట తీసుకెళ్లవచ్చు. 


సెకండ్ క్లాస్‌లో 25 కిలోల లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ పరిమితి దాటితే రూ.30లు లగేజీ ఛార్జీ చెల్లించాలి.


బుక్‌ చేసుకోకుండా అదనపు లగేజీతో ప్రయాణించే వారికి బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు జరిమానా విధిస్తామని రైల్వే హెచ్చరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa