ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సోమవారం రాష్ట్ర రాజధానిలో భారీ ర్యాలీ నిర్వహించింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిజ్లాల్ ఖబ్రీ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్భవన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. అయితే, వారిని రాజ్భవన్ వైపు వెళ్లనివ్వకుండా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.మాల్ ఎవెన్యూలోని కాంగ్రెస్ కార్యాలయం, రాజ్భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా సోమవారం రాజ్భవన్ను ముట్టడిస్తామని యూపీ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. ఈ ర్యాలీలో లక్నో, పరిసర జిల్లాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ కారణంగా విధాన్ భవన్, రాజ్ భవన్ దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బ్రిజ్లాల్ ఖబ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్యాయం, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, దోషులను శిక్షించడం కంటే పారిశ్రామికవేత్తలను రక్షించడంపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa