తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఆయనను కలిశారు. విజయవాడ రాజ్భవన్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్.. ఒకరోజు ముందుగానే గవర్నర్ నజీర్ను కలిశారు. వారిద్దరూ దాదాపు గంటపాటు పలు విషయాలు చర్చించుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రస్తుత రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa