ఏపీ అసెంబ్లీ సమావేశాలలో రెండో రోజు శాసనసభ లాబీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు ఎదురు పడిన సమయంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రస్తావనకు వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని ఆనంకు చెప్పానని కోటంరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో అదే ఆచరిస్తారా? అని ప్రశ్నించారట.. తాను ఎప్పుడూ ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానంటూ ఆనం వ్యాఖ్యానించారట.
ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇటు టీడీపీ కూడా అభ్యర్థిని పోటీ చేయిస్తోంది.. దీంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి 23మంది సభ్యులు ఉండగా.. నలుగురు అధికార పార్టీకి మద్దతు తెలిపారు. ఇటు వైఎస్సార్సీపీలో కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు అంతకముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సచివాలయం సచివాలయం అగ్నిమాపక కేంద్రం దగ్గర రెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యల ప్లకార్డులను ప్రదర్శించారు. తన నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాగే నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానన్నారు. ఇటు అసెంబ్లీలో మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డుల రూపేణా నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతాను అన్నారు కోటంరెడ్డి.
అసెంబ్లీ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. తన నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డుతో సభలో నిలబడ్డారు. దీంతో క్వశ్చన్ అవర్లో మెంబర్ మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ గుర్తు చేశారు. ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకోవాలంటే విన్నవించాలన్నారు. కోటంరెడ్డి ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే తాము స్పందిస్తామని మంత్రి బుగ్గన అన్నారు. శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులకు తెల్లారే సరికి శ్రీధర్ రెడ్డిపై ప్రేమ వచ్చిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa