జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్కు కారణమైంది. మచిలీపట్నంలో మంగళవారం రాత్రి.. జనసేన 10వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. చెక్కులు ఇచ్చాక పవన్ కళ్యాణ్ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకున్నారు. వేదికపైనే ఆయన తన చేతులకు శానిటైజర్ రాసుకున్నారు. దీన్ని ప్రత్యర్థి పార్టీ పట్టేసింది. ఇదిగో చూడు.. పేదలపై పవన్కు ఎలాంటి ప్రేమ ఉందో అని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.
'అణగారిన వర్గాల వారిని పట్టుకున్నందుకే.. స్టేజ్ మీదనే చేతులు కడుక్కుంటున్నారు. దళితులు అంటే అంత అంటరాని తనమా' అని రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. అయితే.. ఈ వీడియోపై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు.. జన సైనికులు కౌంటర్ ఇస్తున్నారు. వీడియోలను ఎడిటింగ్ చేసి.. పవన్పై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. చిన్న బాబును ఎత్తుకొని శానిటైజర్ రాసుకుంటున్నట్టు ఎడిట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతీసారి.. ఇంకా దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa