వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారు. తాను చిటికేస్తే, మూడో కన్ను తెరిస్తే, ఏమవుద్దో తెలుసుకుని మసలుకోవాలని హెచ్చరించారు. తన సినిమాలోని పాట వేశారని ఓ కార్యకర్తను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను సినిమాలనే చూడాలన్నారు బాలయ్య. రాజకీయ నాయకుడు హుందాగా ఉండాలని.. నీచానికి దిగజారొద్దన్నారు.
రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అన్నారు బాలయ్య. తన సినిమాలను అన్ని పార్టీల వాళ్లు చూస్తారని.. నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పద్దతి మార్చుకోవాలని ఎమ్మెల్యేను హెచ్చరించారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజుల క్రితం భాస్కర్ రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలంరేపింది. నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభను ఏర్పాటు చేశారు.. పార్టీలకతీతంగా భక్తులు విరాళాలు అందజేశారు. అయితే ప్రభ దగ్గర డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయగా.. నందమూరి బాలకృష్ణ పాటలు పెట్టి డాన్స్ చేశారు. ఇంతలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి.. భాస్కరరెడ్డిని మందలించారు.
అందుకే భాస్కర్ రెడ్డి మనస్తాపానికి గురై ఎమ్మెల్యే ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు, కార్యకర్తలు భాస్కరరెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు భాస్కరరెడ్డిని ఇంటికి తరలించారు. బాలకృష్ణ పాట పెట్టినందుకే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై బాలయ్య స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa