ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని వ్యక్తి మృతి,,,జనసేన కార్యకర్తల ర్యాలీలో అపశృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 04:07 PM

జనసేన కార్యకర్తల ర్యాలీలో అపశృతి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో మంగళవారం నిర్వహించిన జనసేన ర్యాలీలో పాల్గొన్న ఓ కార్యకర్త.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చందన ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు.. కంకిపాడు ఎస్సై వెల్లడించారు.


జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విజయవాడ నుంచి వారాహిపై ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో.. పవన్ వెంట్ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. బైక్‌లపై పవన్‌ను అనుసరిస్తూ ర్యాలీగా వెళ్లారు. ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా వందలాది బైక్‌లు రావడంతో.. ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని మృతుడు ఆంజనేయులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa