ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర సమస్యలపై అమిత్ షాకు జగన్ వినతిపత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 09:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతోపాటు పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించిన సీఎం జగన్... ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా ఎదుట ప్రస్తావించారు. విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి సమర్పించినట్టుగానే, అమిత్ షాకు కూడా విజ్ఞాపన పత్రం అందజేసినట్టు తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa