రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి ఉన్నాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్రాజు అన్నారు. వైసీపీతో సంబంధం లేదని బీజేపీ నాయకులుగా తాము ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బీజేపీ తెలంగాణలో దూకుడుగా ఉంటూ ఏపీలో వెనుకబడి ఉండడానికి కారణం.. వైసీపీతో ఉన్నామనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడమేనన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, వైసీపీ నాయకులు వెండి బిస్కెట్లు, డబ్బులు పంపిణీ చేసినా నిజాయితీగా ఓట్లు వేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa