కుప్పం నియోజకవర్గంలో ఇటీవల అకాల వడగండ్ల వర్షం కురిసింది. కుప్పంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కుప్పం మండలంలో టమోటాతోపాటు ఇతర పంటలూ దెబ్బతిన్నాయి. కుప్పం నియోజకవర్గంలో 500-600 ఎకరాలలో అరటి, బంగాళాదుంపలు, వరి, బీన్స్, క్యాప్సికంతోపాటు వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. బిరుదనపల్లెలో గోవిందరాజులు, మునస్వామి, రాజు అనే రైతుల పంటలు ధ్వంసమయ్యాయి. పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి. పిడుగు వల్ల కంగుంది పంచాయతీకి చెందిన కన్నప్ప ఇల్లు కూలిపోయి, రుణంగా తెచ్చిన రూ.1.80 లక్షలు నగదు కాలిబూడిదై పోయింది. కన్నప్పతోపాటు ఆయన కుటుంబ సభ్యులైన కదిరమ్మ, చిన్నమ్మలకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారి కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతోపాటు, వారి చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ద్వారా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa