ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి విడదల రజిని ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 12:58 PM

అసెంబ్లీలో పోడియం వద్ద స్పీకర్‌ పట్ల టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దుర్మార్గం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు పూర్తిగా సంస్కారం కోల్పోయి, గూండాయిజం, రౌడీయిజం చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయడానికి అవకాశం లేదుకాబట్టే దిక్కుతోచని పరిస్థితుల్లో, చేతగానితనంతో శాసనసభలో టీడీపీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇదంతా చంద్రబాబు స్కెచ్‌ అని మంత్రి రజిని అన్నారు. శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa