సభలో తనను అవసరంగా టీడీపీ సభ్యులు తిట్టారని, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండు చేశారు. సోమవారం సభలో టీడీపీ నేతల తీరును డిప్యూటీ సీఎం ఖండించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. అసెంబ్లీ అనే దేవాలయంలో టీడీపీ రాక్షస మూకలు వచ్చి దౌర్జన్యానికి దిగుతున్నారు. చంద్రబాబుకు ఎస్సీలంటే ముందు నుంచి గిట్టదు. ఆయన ఇంట్లో పని చేసే వారంతా కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే. వైయస్ జగన్ నడక భూమిపైనే అంటే..చంద్రబాబు తన నడక కోటిశ్వరులతోనే అంటాడు. వైయస్ జగన్ ఉద్యోగులు, పెన్షనర్లతో ప్రేమగా ఉంటే..చంద్రబాబు వీళ్ల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తారు. టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణస్వామి డిమాండు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa