ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీపీఐపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 12:19 PM

పెద్దకడబూరు: మండలంలో కల్లుకుంట గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో సీపీఐ శాఖ కార్యదర్శి సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం సీపీఐ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ మాట్లాడుతూ సీపీఐ పార్టీపై కల్లుకుంట గ్రామానికి చెందిన రమేష్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సీపీఐపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. గతంలో సర్వే నెంబర్ 175/బి, 174/1 లక్ష్మన్న, రమేష్ అనే వ్యక్తుల మధ్య వివాదాలు ఉన్నాయని, సిపిఐ పార్టీని ఆశ్రయించగా ఆ సమస్యపైన తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తే అధికారులు ఆ భూమిపైన వివాదాలు ఉన్నాయని అప్పట్లో ఆర్డీవో తహసీల్దార్ కు ఫోన్ చేసి రెడ్ మార్కులో పెట్టించారు. రమేష్ అనే వ్యక్తి లక్ష్మన్న 13 ఎకరాలు ప్రభుత్వభూమిని అక్రమంగా పట్టాలు పొందరని ఆ పట్టాలు రద్దు చేసి భూమిలేని నిరుపేదలకే దక్కాలని రమేష్ చెప్పడంతో ఆ భూమిపై పార్టీ జోక్యం చేసుకొని పేదలకు ఇవ్వాలని పోరాటం చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఇంతలోనే ఒకే లక్ష్మన్న రమేష్ తో డబ్బులు ఇస్తా అని ఒప్పందం కుదుర్చుకొని సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్ళితే రెవెన్యూ సిబ్బంది ఆ భూమి కోర్టులో ఉందని, చెప్పడంతో ఏం చేయాలో తెలియక రమేష్ అనే వ్యక్తి సీపీఐ నేతపైన డబ్బులు ఇచ్చాను అని అసత్య ఆరోపణలు చేయడం మొదలు పెట్టడని ఆరోపించారు. ఇది కేవలం భూ పోరాటాన్ని ఆపాలనే నాటకాలు అని, అలాగే ఏడబ్ల్యూ భూమిని పేద ప్రజలకు చెందేవరకు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే నా ప్రాణాలు అడ్డు పెట్టైనా ఈ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి జాఫర్ పటేల్, డోల్ అనుమంతు, బీకేఎంయు నాయకులు కుమ్మరి చంద్ర, నాగేష్, గోపాల్, సీనియర్ నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa