ఏపీలో తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దుమారంరేపుతోంది. గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్యతకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒక ఉదాహరణ అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమల ఏర్పాటు వల్ల అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అవసరం పెరిగిందన్నారు. ఇక్కడ, ఓ ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులను ఎందుకు కేటాయిస్తుందనే అనుమానం ఎవరికైనా వస్తుందని, యూరో లాటరీల మాదిరి ఆ టీడీపీ హయాంలో షెల్ కంపెనీలతో కలిసి సింగపూర్ కేంద్రంగా స్కామ్ జరిగిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. సీమెన్స్ సంస్థకు లేఖ రాస్తే అంత తక్కువ పెట్టుబడికి అంత ఎక్కువ ఎలా పెడతామని సమాధానం ఇచ్చారన్నారు. డిజైన్ టెక్ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్ ట్రాన్స్ఫర్ జరిగిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రిన్పిపల్ సెక్రటరీ స్వయంగా జీవో విడుదల చేశారన్నారు.
అప్పటి ఏలేరు స్కామ్లో చంద్రబాబు పాత్ర అందరికీ తెలుసని, స్టాంప్ల కుంభకోణంలోనూ చంద్రబాబు హస్తం బయటపడిందని మంత్రి అమర్నాత్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని, ఇందులో చంద్రబాబు, లోకేష్ అరెస్టు కావాల్సి ఉందన్నారు. దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే ఇందులో ఈ బాబుల స్కామ్ బయటపడుతుందని పేర్కొన్నారు. చంద్రబాబుకి అవినీతిలో నోబుల్ ప్రైజ్, మోసం చేయడంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa