ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెదకూరపాడు ఎమ్మెల్యేనుంచి,,,తనకు ప్రాణహాని ఉందన్న వైసీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 08:38 PM

వైసీపీలో గ్రూపు రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. దీంతో  ఏపీలో జగన్ సర్కార్‌కు రోజుకో తలనొప్పి వచ్చి పడుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం సంచలనంగా మారింది. ఆ వెంటనే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఈ ఎపిసోడ్ మర్చిపోకముందే మరో ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నేత సొంత పార్టీ శాసనసభ్యుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చాడు.


పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై స్థానిక వైఎస్సార్‌సీపీ నేత దండా నాగేంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శంకర్రావుతో పాటూ ఆయన కుటుంబం నుంచి తనకు ప్రాణ హాని ఉందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయడంతో.. ఎమ్మెల్యే శంకర్రావు, ఆయన కుటుంబ సభ్యులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. గతంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక వ్యవహారంలో తనతో ఎమ్మెల్యే శంకర్రావు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించారన్నారు.


జేపీ సంస్థ ఇసుక అమ్ముతుందన్న అక్కసుతో తనను బెదిరించి, ప్రలోభ పెట్టీ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించారన్నారు. ఇప్పుడు ఇసుక కాంట్రాక్ట్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కు రావడంతో ఎన్జీటీలో కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. తనపై అక్రమం గా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు పట్టించుకోకుండా పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద పెద్ద మిషనరీలతో ఇసుక తవ్వేస్తున్నారన్నారు.


గతంలో పిటిషన్ వేయించిందిఎమ్మెల్యే శంకర్రావు అని.. ఇప్పుడు కేసు వెనక్కు తీసుకోవాలని బెదిరిస్తున్నారని.. అయినా తాను వెనక్కు తగ్గలేదని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే జేపీ వెంచర్స్‌ ప్రతినిధులను బెదిరించిన వీడియోకాల్‌ను నాగేంద్రకుమార్‌ బయటపెట్టారు. ఇప్పటికైనా తీర్పును అమలు చేయకపోతే మరోసారి ఎన్జీటీని ఆశ్రయిస్తానన్నారు ఆయన. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి.రెండు నెలల క్రితం కూడా బెల్లంకొండ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ఎమ్మెల్యే శంకర్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమ్మతి గళం వినిపించింది. వైఎస్సార్‌ అంటే అభిమానంతో పార్టీలో చేరామని.. డబ్బులు కూడా ఖర్చు పెట్టామన్నారు.


పార్టీ కోసం తన పొలాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని.. ఈ నాలుగేళ్లలో తన సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోయాను అన్నారు. గతంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే, ఎంపీకి చెప్పినా పట్టించుకోలేదన్నారు. తనను జెడ్పీటీసీగా గెలిపించుకున్న ప్రజలకు కూడా పనులు చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కేసులు పెట్టినా పార్టీ కోసం భరించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa