ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు,,,,అందుకున్న అయ్యన్నపాత్రుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 08:01 PM

టీడీపీ నేత చింతకాయల విజయ్‌ కు సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. రాజమండ్రి సీఐడీ పోలీసులు నర్సీపట్నంలో ఉన్న ఇంటికి వెళ్లి.. మార్చి 28న విచారణకు గుంటూరు సీ. ఐ. డీ కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టుల వ్యవహారంలో ఈ నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో విజయ్‌ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో.. ఆయన తండ్రి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి అందజేశారు. అయితే కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా నోటీసులు ఇస్తున్నారన్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రజా అధికారంతో ఇంకెన్నాళ్ళు బీసీల గొంతు నొక్కుతారని మండిపడ్డారు.


సోషల్ మీడియాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై దుష్ప్రచారం చేశారంటూ.. చింతకాయల విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. క్రైమ్‌ నంబర్‌ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 153–ఎ, 120–బి రెడ్‌విత్‌ 34, 419, 469, 505(2) ఐటీ చట్టం సెక్షన్‌ 66(సి) కింద కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు.. విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాలతో సీఐడీ విచారణకు వచ్చాను అన్నారు.


ఏపీ సీఎం జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని.. అవి కూడా ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్లు చేశారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఐటీడీపీ బాధ్యతల్ని చింతకాయల విజయ్‌ చూస్తున్నారని.. అందుకే ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సీఐడీ హైదరాబాద్‌లోని నివాసంలో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. ఆ సమయంలో పరిణామాలపై సీఐడీ అధికారులుపై విమర్శలు వచ్చాయి.


మరో కేసు కూడా చింతకాయల ఫ్యామిలీని వెంటాడుతోంది. నర్సీపట్నంలోని ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫోర్జరీ ఎన్‌వోసీ పత్రాలతో మోసం చేశారని కేసు నమోదు కాగా.. అయ్యన్నతో పాటూ చిన్న కుమారుడు రాజేష్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరైంది. ఇంటి ప్రహరీ నిర్మాణాన్ని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆరోపణలు వచ్చాయి.


ఈ కేసులో అయ్యన్న, రాజేష్‌ హైకోర్టులో పిటిషన్ వేసి.. ఆ కేసును కొట్టేయాలని కోరారు. కోర్టు విచారణ జరిపి.. అయ్యన్నపాత్రుడిపై నమోదు చేసిన 467 సెక్షన్ చెల్లదని తీర్పు ఇచ్చింది. సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయొచ్చని చెప్పింది..ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరగా.. హైకోర్టు తీర్పును కొట్టివేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa