హీరో నారా రోహిత్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. లోకేష్త కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందని.. అందుకే టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్ర రాబోయే రోజుల్లో ఓ ప్రభంజనంలా మారబోతోందన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన సమయం వచ్చిందని.. జూనియర్ ఎన్టీఆర్ కూడా సమయం చూసుకుని రాజకీయాల్లోకి వస్తారన్నారు. అవసరమైనప్పుడు తారక్ కచ్చితంగా ఎంట్రీ ఇస్తారన్నారు.
మరోవైపు మూడు రోజుల విరామం తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ముదుగా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్ర 50 వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 625 కి.మీ దూరం నడిచారు లోకేష్. ఇక 50వరోజు (25-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు ఇలా ఉన్నాయి..
9.00 – ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
10.00 – గాజులకుంటపల్లిలో రైతులతో సమావేశం
10.55 – వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గ ప్రముఖులతో భేటీ.
11.50 – ఒడిసి గ్రామంలో భోజన విరామం.
2.25 – ఒడిసి నుంచి పాదయాత్ర కొనసాగింపు
2.35 – ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మైనారిటీలతో భేటీ.
సాయంత్రం
4.00 – ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.
5.45 – మొహమ్మదాబాద్ క్రాస్ వద్ద అమడగూరు స్థానికులు, సత్యసాయి వర్కర్లతో సమావేశం.
6.40 – రామయ్యపేట విడిది కేంద్రంలో బస
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa