ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ భారం పడలేదు. 2023-24 వ ఆర్థిక సంవత్సరమునకు విద్యుత్ టారిఫ్ వివరాలను ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపలేదన్నారు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి. రైతులకు ఉచిత విద్యుత్తు, ఎస్సీ, ఎస్టీలకు రెండు వందల యూనిట్లు వరకు ఇస్తున్న సబ్సిడీ, ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిందన్నారు. రూ.10135 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని.. ప్రభుత్వం ఆ ఛార్జీలను భరించడానికి ముందుకు రావడం సంతోషమన్నారు.
ఆర్ధిక అవసరాలపై డిస్కం లు ఇచ్చిన టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు నాగర్జున రెడ్డి. మూడు డిస్కం లకు కలిపి ప్రభుత్వం సబ్సిడీ గా ఇచ్చే విద్యుత్ వల్ల రూ. 10135 కోట్లు లోటు వచ్చిందని.. దీన్ని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అందుకే వినియోగదారులపై భారం వేయాల్సిన అవసరం రాలేదని.. సాధారణ, పారిశ్రామిక వినియోగ దారుల కేటగిరీ లో ఎవరిపై అదనపు ఛార్జ్ లు లేవని క్లారిటీ ఇచ్చారు. హెచ్ టీ వినియోగదారులకు మాత్రం కిలో వాట్ కు 475 రూపాయల అదనపు డిమాండ్ ఛార్జ్ల ప్రతిపాదనను అంగీకరించామన్నారు. మిగతా ప్రతిపాదనలన్నీ తిరస్కరించామన్నారు.
సోలవార్ పవర్లో ఏదైనా సమస్య ఉంటే.. సోలార్ పంపుసెట్లు వాడుతున్న అర్హులైన రైతులకు, ప్రభుత్వం విధానం ప్రకారం, ఉచిత విద్యుత్ను డిస్కమ్లు వారికి ఇవ్వాలి. సోలార్ రూఫ్టాప్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఏపీఈఆర్సీ 2019 మేలో ఆమోదించిన సోలార్ రూఫ్టాప్ నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను, డిస్కమ్స్ కచ్చితంగా పాటించాలి. కరెంట్ బిలుల్లోని వివిధ వివరాల అలైన్మెంట్, వాటి విజిబిలిటీకి సంబంధించి ఈ ఉత్తర్వు విడుదలైన 30 రోజుల్లోగా పూర్తి నివేదికను ఏపీఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలను ఆదేశించారు
వ్యవసాయ వినియోగదారులకు 9 గంటల సరఫరాను నిర్థారించడానికి సంబంధించి విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 1656 (5) ప్రకారం ఏర్పాటు చేసి జిల్ల కమిటీల నివేదికలు, మినిట్స్ను డిస్కమ్లు వారి వెబ్సైట్లలో ఉంచాలని.. దానిని కమిషన్కు సమర్పించాలని ఆదేశించారు. డీబీటీ, వ్యవసాయం వినియోగదారులకు మీటరింగ్, స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్లు, ఇతర సమస్యలపై కొంతమంది స్టేక్ హోల్డర్స్ లేవనెత్తిన భయాందోళలనకు సంబంధించి కమిషన్ ఆర్డర్లో పూర్తి వివరణ ఇచ్చింది. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa