ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:26 PM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి బలవంతపు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లయి, ఓ కుమార్తె కూడా ఉంది. వివరాల్లోకి వెళ్ళితే......చిత్తూరు జిల్లా, గంగవరం మండలానికి చెందిన చలపతి(33) ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే 17 ఏళ్ల విద్యార్ధినితో చనువుగా ఉంటూ వచ్చాడు. మాయమాటలు చెప్పాడు. బుధవారం రోజున చివరి పరీక్ష రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్లాడు. తాను నిజాయితీపరుడని, తనను నమ్మితే సంతోషంగా చూసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అక్కడే ఓ ఆలయంలో పెళ్లికూడా చేసుకున్నాడు. కొద్దిసేపటికి లెక్చరర్‌ చలపతి నిజస్వరూపాన్ని ఆమె గమనించారు. అతడి మాటలకు పొంతన లేకపోవడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి గురువారం రాత్రి గంగవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకొంది. లెక్చరర్‌ మాయమాటలు చెప్పి మోసంచేశాడని తల్లిదండ్రుల వద్ద విలపించింది. ఆ బాలికతోపాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లెక్చరరు చలపతిపై ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి చేసి కోర్టుకు హాజరు పరచినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, నిందితుడికి అంతకుముందే పెళ్లయి, బిడ్డ కూడా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa