ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:27 PM

పుట్టపర్తి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు  స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ  రౌడీ మూకలు పెట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి, పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేయటం దుర్మర్గపు చర్య అని అన్నారు. ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారని ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలు ఫూటుగా మద్యం తాగి దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వైసీపీ గూండాల్ని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయటం ఏంటని నిలదీశారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa