కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో తొలగించబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల జొక్యంతో కలెక్ట రేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప, సీనియర్ నాయకులు ఎస్.మనోహర్ మాణిక్యం, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి హెచ్.కృష్ణయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు వి.రఘురామమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సిపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ 20 సంవ త్సరాలుగా పని చేసిన 107 మంది ఉద్యోగులను ఎలా తొలగిస్తారని, వీరి ఉద్యోగాలను అమ్ముకున్న హాస్పిటల్ సూపరింటెం డెంట్ నరేంద్రనాథ్ రెడ్డి, ఏడీ రమేష్బాబుఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఓబీ నాగరాజు, బి.రాజు, ఈశ్వర్, టి.రామాంజినేయులు, నరసరావు, వెంకటేష్ కిట్టు, రాము, రెహిమాన్, రంగన్న, బజారి, యేసు, మాదవ స్వామి, పురుషోత్తం, నాగేంద్ర, ఈశ్వర్ రెడ్డి, ఇర్మియ, జయరామిరెడ్డి, నాగ రాజు, మహేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa