‘‘ప్రధాని మోదీతో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దీనిని సీఎం జగన్ ఏ పరిస్థితుల్లో ప్రశ్నించలేకపోతున్నారో? అందుకుగల కారణాలేమిటో నాకు తెలియదు’’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేవీపీ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఎన్డీఏ చైర్మన్గా వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించకుంటే చరిత్ర హీనుడవుతారు. 2019లో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని నేను విభేదించా. ప్రచారానికీ వెళ్లలేదు. కానీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు పోరాడితే ఆయన వెంట నడుస్తా. దేశం కోసం త్యాగం చేసిన నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు ఢిల్లీలో ఇల్లు కూడా లేదు. ఆయనకు జరిగిన అన్యాయంపై రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నించకపోవడం ఏమిటి!’’ అని కేవీపీ నిలదీశారు. ఇదే అంశంపై సీఎం జగన్ మాట్లాడకపోవడాన్ని ఎందుకు నిలదీయడంలేదన్న ప్రశ్నకు... ‘151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది లోక్సభ.. 11 మంది రాజ్యసభ సభ్యులున్న పార్టీ’ అని చెప్పానుగా అంటూ కేవీపీ సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్నకు సమాధానంగా ‘‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా మెలిగిన నేను ఆయన కుమారుడు జగన్కు దూరంగా ఎందుకు జరిగానన్న ప్రశ్నకి పూర్తి సమాధానం మరో మీడియా సమావేశంలో చెపుతాను. కచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే. ఆ బాధ్యత నామీద ఉంది. దీనినుంచి నేను తప్పించుకోలేను’’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa