ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు కేంద్రానికి వ్యతిరేకంగా పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 01:07 PM

 బీజేపీ నుండి దేశానికి విముక్తి కలిగించాలని  సీపీఐ కడప జిల్లా కార్యదర్శి నరసింహులు పిలుపునిచ్చారు. ములకలచెరువులో నియోజకవర్గ కార్య దర్శి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ సీపీపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదానీ, అంబానీలకు ఊడిగం చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నాడన్నారు. గ్యాస్‌, పెట్రో ధరలను ఏ మాత్రం నియంత్రించడం లేదన్నారు. ఈ విధానాలపై పోరాటాలు కూడా చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 1ని తెచ్చి నిరంకుశ పాలన చేస్తోందన్నారు. నియోజకవర్గ ఇనచార్జి కృష్ణప్ప మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు అంజనప్ప, సలీంబాషా, ఆనంద్‌, తంబ య్యశుట్టి, గంగులప్ప, జయకర్‌, రామచంద్ర, భాస్కర, వెంటకస్వామి. సుధాకర్‌, అంజలమ్మ, డీహెచపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హరికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa