అనంతపురం జిల్లా, చెన్నేకొత్తపల్లి మండలం ఉప్పరవాండ్లపల్లి కొట్టాలకు చెందిన రైతు, కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్ళితే.... రైతులు తాము పండించిన కూరగాయలను బెంగళూరు మార్కెట్కు వ్యానలో తీసుకువెళ్లి విక్రయించారు. తిరిగి అదే వ్యానలో స్వగ్రామానికి వస్తుండగా గురువారం తెల్లవారుజామున చిక్బళ్లాపూర్ సమీపంలోని పేరేచంద్ర వద్ద వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాన జాతీయ రహదారిపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతిచెందారు. వ్యాన డ్రైవర్, మరో ఐదుగురు రైతులు బసినేపల్లికి చెందిన రామాంజి, ప్యాదిండికి చెందిన ఈడిగ కిష్టప్ప, భాస్కర్రెడ్డి, వన్నూరప్ప, సాయి గాయపడ్డారు. వీరిని వెంటనే చిక్బళ్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన ఈశ్వరయ్యకు భార్య మణెమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వ గ్రామం ఉప్పరవాండ్లపల్లి కొట్టాలకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa