ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైపులైన్ పనులు త్వరితగతిన పూర్తిచేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 10:36 AM

నరసన్నపేట మేజరు పంచాయతీ పరిధిలోని దేశవానిపేట వద్ద గడ్డెయ్య చెరువుకు నీరు సక్రమంగా అందించేందుకు వీలుగా చేపడుతున్న పైప్ లైన్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ ఉదయభాస్కర్ అన్నారు. దేశవానిపేట పశువుల ఆస్పత్రి వద్ద జరుగుతున్న పైప్ లైన్ పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉందని, చెరువులో తొందరగా నీరు నింపితే స్థానికలు సేదతీరేందుకు అవకాశం ఉంటుందన్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని సర్పంచ్ బూరల్లి శంకర్కు సూచించారు. మూడు రోజుల్లో పనులు పూర్తిచేస్తామని సర్పంచ్ తెలిపారు. పనులు నిబంధనల మేరకు నాణ్యతగా ఉండాలని ఏఈ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa