నగరంలో వివిధ డివిజన్లలో రూ. 52. 90 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం ప్రారంభించారు. 22వ డివిజన్లోని బొడ్డు వారి జంక్షన్ వద్ద, 23వ డివిజన్ పరిధిలోని బొండాడ వీధి వద్ద, 32వ డివిజన్ తోటపాలెం షిరిడి కాలనీ ప్రాంతాలలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు మాట్లాడుతూ నిర్లక్ష్యానికి గురైన నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో కోలగట్ల పనిచేస్తున్నారని అన్నారు. వార్డు పర్యటనలు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానికుల నుంచి వచ్చిన వినుతులను స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa