సాలూరు పట్టణ 14, 23వార్డులకు చెందిన బంగారమ్మ, రామా కాలనీల్లో పట్టణ కో-ఆర్డినేటర్, కౌన్సిలర్ గిరి రఘు ఆధ్వర్యంలో శనివారం జరిగిన జగనే మా భవిష్యత్తు కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పాల్గొని కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారి కోసం, మహిళల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను అందజేస్తూ వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డే మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, కావున ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా ఉండాలన్నారు. తెలుగుదేశం పార్టీ వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఆ పార్టీ వారు చెప్పేది ఒకటి, చేసేది వెరోకటన్న విషయం మీ అందరికీ తెలిసిందేనన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే సాద్యమన్నారు. పింఛన్ అనే కాకుండా సంక్షేమ పథకాలన్ని నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాలో జమవుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కావున అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, రఘు, తాడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa