ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 10 నుంచి స్థానిక సమస్యలపై డివైఎఫ్ఐ పర్యటనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 12:33 PM

కడప నగరంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 10వ తేదీ నుండి విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నట్లు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డిఎం ఓబులేసు తెలిపారు. డివైఎఫ్ఐ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభంలోనే నీటి కష్టాలు తీవ్రస్థాయిలో ఉన్నాయన్నారు. ఇప్పటికే అక్కాయిపల్లి, సాయి పేట, బురాందిన్ వీధి, ఖలీల్ నగర్ ప్రాంతాల్లో వారం పది రోజులైనా నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. రామకృష్ణ నగర్, సుందరయ్య నగర్, వైయస్సార్ కాలనీ, మృత్యుంజయ కుంట ప్రాంతాలలో రోడ్లు, మౌలిక వసతుల సమస్యలు చాలా తీవ్రంగా ఉందన్నారు. శంకరాపురంలోని మున్సిపల్ క్వార్టర్స్ లో డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు లేవన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, నీటి మీటర్లకు వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు ప్రజలు ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఎస్ షాకీర్, ఉపాధ్యక్షులు విజయ్, శివ, జగదీష్ పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa