ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకరిపై, మరొకరు సవాల్ విసురుకున్న నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 01:32 PM

మంత్రి మేరుగ నాగార్జునకు, టీడీపీ నాయకులూ నక్కా ఆనందబాబు  సవాల్ విసిరారు. దళితులు, మైనారిటీ సంక్షేమం - దాడులపై చర్చిద్దామని అన్నారు. మంత్రి మేరుగ చేసిన దాడులు, దోపిడీ, మోసాలు నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇద్దరం సాంఘిక సంక్షేమశాఖకు మంత్రులుగా చేశామని, ఎవరెవరు ఏమేం చేశామో చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని, నియోజకవర్గంలో జగన్‌ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయని చెప్పారు. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa