ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలమా, వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలి : మంత్రి అమర్‌నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 08:27 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ ఎస్ పార్టీ అనుకూలమా, వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని అన్నారు.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటారని అమర్‌నాథ్ ప్రశ్నించారు.ఏడాదిన్నర కిందటే కేంద్ర ఆర్థిక శాఖ మెమోరాండం ఇచ్చిందని, బిడ్డింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించడమే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa