ఆకాశంలో అద్భుతాలు అపుడపుడు జరుగుతుంటాయి. తాజాగా విశాఖ సాగర తీరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సరికొత్తగా నీలి కాంతులతో అలలు సవ్వడి చేస్తున్నాయి. భీమిలి బీచ్ పరిధిలో రాత్రి సయమంలో ఈ అరుదైన అరుదైన దృశ్యం కనిపిస్తోంది. ఈ విషయం తెలియడంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు స్థానికులు సాగర తీరానికి క్యూ కడుతున్నారు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు సాగర తీరంలో కొన్ని రోజులుగా నీలి అలల కాంతులతో కనిపిస్తున్నాయి. కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ఇలా కొద్దిరోజులుగా రాత్రి సమయంలో సాగర తీరం నీలివర్ణంలో వెలిగిపోతోంది. ముందు పర్యాటకులు ఏదో జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీలి అలలు ఎగసిపడుతుంటే ఆసక్తిగా చూశారు. అయితే వీటిని బయోల్యూమినిసెన్స్ తరంగాలు అంటారని తెలుస్తోంది. ఇలాంటివి కేరళలోని కొచ్చిన్ సాగ తీరంలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటున్నారు. తూర్పుతీరంలో ఇదే మొదటిసారని.. అంతేకాదు ఇవి రెండు వారాలపాటు కనిపిస్తాయని చెబుతున్నారు.
ఫైటో వంటి శైవలాలు వేగంగా వృద్ధి చెందుతుంటాయి.. ప్లాంక్టన్ అని పిలిచే చిన్నచిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా నీలి కాంతి విడుదలవుతుంది అంటున్నారు. అందుకే బయోలుమినిసెంట్ తరంగాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. సముద్రంలో ఆల్గే ఎక్కువగా పెరగడం వల్ల బయోల్యూమినిసెన్స్ వస్తాయంటున్నారు. ఆల్గేలో జరిగే ఒక రసాయన చర్య వల్ల నీలి రంగు వస్తుంది అంటున్నారు. అలాగే కొన్ని ఆల్గేల వల్ల బీచ్లు ఆకుపచ్చ వర్ణంలోనూ మెరుస్తుంటాయట.
ఇలా దేశవ్యాప్తంగా చాలా సముద్ర తీరాలు ఇలా మెరవడం కొత్తేమీ కాదు అంటున్నారు. లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర, మాల్దీవులు, చెన్నైలో కొన్నిసార్లు ఈ తరహా బయోలుమినిసెన్స్ కనిపించాయట. ఇవి ఎక్కువగా వృద్ధి చెందడం వల్ల చేపల గిల్స్ రంధ్రాలు మూసుకుపోయి చేపలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ శైవలాలు ఎక్కువగా ఉన్న చోట చేపలు దూరంగా ఉంటాయట.
ఈ నీలి మెరుపులు ఎక్కువ రోజులు ఉంటే ఆ ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఆక్సిజన్ తగ్గి సాగర జలాల్లోని జీవరాశులకు కాస్త ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. మొత్తానికి విశాఖ బీచ్లోని ఈ నీలి కాంతుల గురించి స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు బీచ్లకు వెళుతున్నారు. రెండు వారాల పాటూ ఇలాగే ఉంటుందా.. లేదంటే ఒకటి, రెండు రోజులు మాత్రమేనా అనేది కూాడా చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa