ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడిపత్రిలో కొనసాగుతన్న యువగళం,,,ముందుగానే అప్రమత్తమైన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 08:44 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొనసాగుతోంది. ముందుగా మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అట్ట‌డుగువ‌ర్గాలు, మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి విద్య‌నే ఆయుధంగా అందించిన పూలే మ‌హాశ‌యుని ఆశ‌యసాధ‌న‌కి కృషి చేయ‌డం అందరి బాధ్య‌త‌ అన్నారు. అనంతరం ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుంచి 67వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది.


శింగనమలలో పాదయాత్ర పూర్తి చేసుకుని తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి చేరుకుని లోకేష్‌కు స్వాగతం పలికారు.


మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రోజుల పాటు యువగళం జరగనుండటంతో.. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని మోహరించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదంటున్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే పాదయాత్ర వద్దకు వచ్చి లోకేష్‌ను నిలదీస్తాను అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలతో తాడిపత్రి నియోజకవర్గంలో హైఅలర్ట్ ప్రకటించారు.


ఈ క్రమంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని పోలీసులు హితవు పలికారు. నారా లోకేష్ కు నోటీసులు అందజేసేందుకు వెళ్లిన డీఎస్పీ చైతన్య వెళ్లగా.. నోటీసులు తీసుకునేందుకు నారా లోకేష్ నిరాకరించారు. నోటీసులు తీసుకునేందుకు లోకేష్ తిరస్కరించడంతో యాడికి టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు నోటీసులు అందజేశారు పోలీసులు.


అలాగే రాజకీయ పార్టీల నేతలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.. వారిని కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోరినట్లు సమాచారం. ఒకవేళ ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటు నారా లోకేష్ పాదయాత్ర వద్ద పోలీసు భద్రత పెంచారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసు పహారా పెంచారు. తాడిపత్రి నియోజకవర్గం రాయలచెరువు సభలో బుధవారం లోకేష్ ప్రసంగించనున్నారు. దీంతో అందరి కళ్లు ఈ సభపై ఉన్నాయి. పోలీసులు కూడా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందుగానే హెచ్చరించడంతో లోకేష్ ప్రసంగం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. పోలీసుల్ని ముందుగానే మోహరించారు.. అవసరమైన చోట భద్రతను కట్టిదిట్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa