టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం డోన్ నియోజకవర్గం పాదయాత్ర సాగుతోంది. శనివారం ఉదయం పొలిమేరమెట్ట క్యాంప్ సైట్ నుంచి లోకేష్ 71 రోజు యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ రోజు డోన్ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకొని పత్తికొండ నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగ సభలో యువనేత మాట్లాడనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa