బిజెపి నిరంకుశ పాలనకు నిరసనగా ఈనెల 24న విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగే జై భారత్ సత్యాగ్రహ సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి షేక్ సలీం పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఎదుట జై భారత్ సత్యాగ్రహ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సలీం మాట్లాడుతూ పార్లమెంటులో అధికార పార్టీ బిజెపి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఉందని అన్నారు.
పార్లమెంటులో నిలదీస్తున్నందుకే రాహుల్ గాంధీ పై కక్షతో కుట్రపూరితంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని అన్నారు. ఈనెల 24న విజయవాడలో జరిగే జై భారత్ సత్యాగ్రహ సభ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి తాడికొండ వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి రెమణి శెట్టి హనుమంతరావు, జిల్లా కార్యదర్శి కొప్పాకుల కృష్ణారావు చౌదరి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు శామ్యూల్, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు గండికోట వెంకయ్య, సీనియర్ నాయకులు దామర్ల వీరప్రసాద్, గోలి సాంబశివరావు, గూడూరు సాంబశివరావు, ఉద్దంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa