పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని జనసేన పీఏసీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ అన్నారు. గురువారం భీమవరంలో వెంకట సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన నాదెండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మొన్న పవన్ కళ్యాణ్, తాను చేసిన ఢిల్లీ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసేసిందని తెలిపారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును 41.15కు మొదటి దశలో పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే ప్రాజెక్టు మరమత్తు కోసం 2,030 కోట్ల రూపాయలు పోలవరం అధారిటీ నుంచి సాంక్షన్ రాకపోయినా జీవో విడుదల చేయడం అవినీతి కాదా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa