ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెజ్లర్ల నిరసనలో రాజకీయదాగివుంది...బ్రిజ్ భూషణ్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 30, 2023, 10:29 PM

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ స్పష్టం చేశారు. తన రాజీనామా తర్వాత రెజ్లర్లు ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయినా తనకేమీ ఇబ్బంది లేదని ఆయన సెటైర్లు వేశారు. అక్కడితో ఆగకుండా.. దీనికి రాజకీయ రంగు పులిమారు. ఉత్తర ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా.. దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళనలు ఎనిమిదో రోజు కొనసాగాయి. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. ఈ పరిణామాలపై బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించారు.


రెజ్లర్ల ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదని.. ఇంతకు ముందు కూడా రెజ్లర్లు తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారని గుర్తు చేశారు. రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని స్పష్టం చేశారు. ఇందులో ఎవరి హస్తం ఉందో ఈరోజు కనిపించిందన్నారు. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులు, మహిళా రెజ్లర్లపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa