ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బాహుబలి లీడర్ ముఖ్తార్ అన్సారీకి న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ముఖ్తార్ అన్సారీ రాజకీయం ముగిసింది. మౌ సీటును చాలా కాలంగా పాలిస్తున్న డాన్ ముఖ్తార్ అన్సారీ.. ప్రస్తుతం బండా జైలులో ఉన్నారు. గత 8 నెలల్లో అన్సారీకి 4 కేసుల్లో శిక్ష పడింది. ముఖ్తార్కు కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. అతని అన్న అఫ్జల్ అన్సారీకి కూడా 4 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముఖ్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారీ కూడా జైలులోనే ఉన్నాడు. ఆయన ప్రస్తుతం చిత్రకూట్ జైలులో ఉన్నాడు. అతని భార్య నిఖత్ అన్సారీ కూడా జైలులోనే ఉన్నారు. ఇక ముక్తార్ భార్య పరారీలో ఉంది. ముఖ్తార్ అన్సారీపై వారణాసి, మౌ, ఘాజీపూర్, అజంగఢ్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కిడ్నాప్, హత్య సహా మొత్తం 61 కేసులు నమోదయ్యాయి.
ముఖ్తార్ అన్సారీ విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన జైలులో ఉన్నప్పుడే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ముఖ్తార్ అన్సారీ.. మౌ అల్లర్ల తర్వాత 2005 అక్టోబర్ 25న ఘాజీపూర్ కోర్టులో లొంగిపోయాడు. ముఖ్తార్ అన్సారీ ఒక్కడే కాదు.. ఆయన కుటుంబంలోని చాలా మంది వివిధ నేరాల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారిపై మొత్తం 97 కేసులు నమోదయ్యాయి.
ముఖ్తార్ అన్సారీ దాదాపు 26 ఏళ్ల పాటు.. పూర్వాంచల్ రాజకీయాల్లో తనదైన ముద్రు వేసుకున్నారు. 1996లో ముఖ్తార్ అన్సారీ.. మౌ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ టిక్కెట్పై మొదటిసారి ఎన్నికలలో గెలుపొందారు. ఆ తర్వాత 2002, 2007 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. 2012లో క్వామీ ఏక్తా దళ్ పేరుతో సొంత పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ తర్వాత 2017లో కూడా సొంత పార్టీ నుంచి ఎన్నికల పోరులో గెలిచారు ముఖ్తార్ అన్సారీ. 2022 సంవత్సరంలో తన స్థానంలో తన కుమారుడు అబ్బాస్ను నామినేట్ చేశాడు. ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీ.. సుభాష్పలో పోటీ చేశారు. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa