రాబోయే 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతా వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐఎండీ అంచనాల ప్రకారం.. తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ హిమాలయ ప్రాంతంలో హిమపాతం, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో తేలికపాటి నుండి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్లలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ భారతదేశంలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 1న రాయలసీమ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో, మే 2 వరకు రాయలసీమ, కర్ణాటక, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
అలాగే.. ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. మే 1, 2 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో.. మే 1 నుంచి మే 4 వరకు అస్సాం, మేఘాలయలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయని హెచ్చరించడంతో.. రైతుల్లో ఆందోళనను మరింత పెరిగింది. భారీ వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa